ఉత్తరప్రదేశ్ లోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు... 9 మంది మృతి

  • హాపూర్ జిల్లాలో ఘటన
  • బాయిలర్ పేలడంతో ప్రాణనష్టం
  • 15 మందికి గాయాలు
  • పక్కనే ఉన్న కంపెనీల పైకప్పులు ధ్వంసం
ఉత్తరప్రదేశ్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. హాపూర్ జిల్లా ధౌలానా యూపీఎస్ఐడీసీ ఇండస్ట్రియల్ ఏరియాలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో నేడు భారీ పేలుడు సంభవించింది. బాయిలర్ ఒక్కసారిగా పేలిపోవడంతో 9 మంది మరణించగా, 15 మంది గాయపడ్డారు. కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు ధాటికి పక్కనే ఉన్న ఇతర కంపెనీల పైకప్పులు కూడా దెబ్బతిన్నాయి. పేలుడు కారణంగా చెలరేగిన మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక దళం, పోలీసులు మూడు గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. 

కాగా, ఈ పేలుడు ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బాధిత కుటుంబాల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు.

Explosion
Deaths
Chemical Factory
Uttar Pradesh

More Telugu News